రూ. 5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య

రూ. 5 లక్షలకు భర్తను అమ్మేసిన భార్య

బెంగళూరు: కర్నాటకలోని మాండ్య జిల్లాలో ‘శుభలగ్నం’సినిమా సీన్​ను తలపించే ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియురాలితో సన్నిహితంగా ఉంటూ ఓ వ్యక్తి భార్యకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయాడు. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని పంచాయితీ పెద్దల ముందుపెట్టింది.

Also Read : కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ పై ఉత్కంఠ.. 20 సీట్లపై కొలిక్కిరాని చర్చలు

తనను మోసం చేసిన భర్తను వదిలించుకునేందుకు ఆమె సిద్ధమైంది. అయితే, ఇందుకు తనకు రూ.5 లక్షలు చెల్లించాలని భర్త ప్రియురాలికి షరతు పెట్టింది. చివరకు వారి మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో డబ్బులు తీసుకుని భర్తను ఆమెకు అప్పగించింది.