కార్తికేయ 2 పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

కార్తికేయ 2 పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ

హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. పలు కారణాల వల్ల వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 13న విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. అదిరిపోయే కలెక్షన్స్ తో హవా కొనసాగిస్తోంది. కాగా ఈ మూవీపై సామాన్య ప్రక్షకులే కాదు పలువురు సెలబ్రెటీలు సైతం ప్రశంసలు గుప్పిస్తు్న్నారు. తాజాగా ఈ చిత్రంపై కాంట్రవర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా కామెంట్ చేశారు.

'కార్తికేయ2' సినిమా అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షాబంధన్' సినిమాల కంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టిందని ఆర్జీవీ ట్వీట్ చేశారు. రాజమౌళి  'ఆర్ఆర్ఆర్', ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్2' సినిమాల కంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచిందంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటికి కంగ్రాట్స్ చెప్పారు. అంతే కాకుండా దర్శక ధీరుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్ లను ట్యాగ్ చేస్తూ వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కార్తికేయ 2కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.  కాగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్  కథానాయికగా నటించారు. నటులు శ్రీనివాస రెడ్డి, 'వైవా' హర్ష చెముడు కూడా కొన్ని సీన్లలో కనిపించి, ప్రేక్షకులను అలరించారు.