వెస్టిండీస్‌‌‌‎తో రెండు టెస్ట్‌‎ల సిరీస్‌ కరుణ్‌, అభిమన్యుపై వేటు

వెస్టిండీస్‌‌‌‎తో రెండు టెస్ట్‌‎ల సిరీస్‌ కరుణ్‌, అభిమన్యుపై వేటు

దుబాయ్‌: వెస్టిండీస్‌‌‌‎తో రెండు టెస్ట్‌‎ల సిరీస్‌‌‌‌‎కు ఇండియా టీమ్‌‎ను గురువారం ప్రకటించారు. మొత్తం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. స్టార్‌‌‌‌‌‌‌‌పేసర్‌‌‌‌‌‌‌‌జస్ప్రీత్‌ బుమ్రాను కొనసాగించిన సెలెక్షన్‌‌‌‌‌‌‌‌కమిటీ.. వెటరన్‌‌‌‌‌‌బ్యాటర్‌‌‌‌‌‌‌‌కరుణ్‌‌‌‌నాయర్‌, అభిమన్యు ఈశ్వరన్‌‎పై వేటు వేసింది. కరుణ్‌‌‌‌‌‌‌‌ప్లేస్‌‎‌‌లో దేవదత్‌‌‌‌‌పడిక్కల్‌‎కు చాన్స్‌‌‌‌‌ఇచ్చింది. టెస్ట్‌‌‌‌‌‌‌‌ఫార్మాట్‌‎లో కరుణ్‌‌‌‌‌‌‌‌, అభిమన్యును కొనసాగించే చాన్స్‌‌‌‌‌‌‌‌లేదని చీఫ్‌‌‌‌‌‌‌‌సెలెక్టర్‌‌‌‌‌‌అజిత్‌‌‌అగార్కర్‌‌‌‌‌‌‌‌ సంకేతాలిచ్చాడు. 

రాబోయే రోజుల్లో పడిక్కల్‌, సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌టీమ్‌‎కు బాగా ఉపయోగపడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‎లో వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రాకు తగినంత విశ్రాంతి లభించిందని చెప్పిన అగార్కర్‌‌‌‌‌‌‌‌.. విండీస్‌‌‌‌‌‌‌‌తో రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌ల్లో ఆడిస్తామని వెల్లడించాడు. ‘బుమ్రాకు ఐదు వారాల విరామం లభించింది. కాబట్టి ఈ సిరీస్‌‌‎లో ఆడేందుకు అతను ఫిట్‌‎గా ఉన్నాడు. 

ఆసియా కప్‌‎లో బుమ్రాపై పెద్దగా వర్క్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌పడలేదు. కాబట్టి రెండు టెస్ట్‌‎లకు అతను అందుబాటులో ఉంటాడు. కరుణ్‌‎కు చాలా అవకాశాలు ఇచ్చాం. వాటిని వినియోగించుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌టూర్‌‎లో ఎనిమిది ఇన్నింగ్స్‌‎ల్లో ఒక్క హాఫ్‌‌‌‌‌‌‌‌సెంచరీ మాత్రమే చేశాడు. నాయర్‌‎తో పోలిస్తే పడిక్కల్‌‌‌‌‌‌‌‌ బెటర్‌‎గా కనిపిస్తున్నాడు. మరో ఏడాది వరకు విదేశీ టూర్లు లేవు. 

కాబట్టి ఈశ్వరన్‌‎ను కొనసాగించడం కష్టం. ఇప్పటికే రాహుల్‌‌, యశస్వి ఓపెనర్లుగా ఉన్నారు. వాళ్లిద్దరూ బాగానే ఆడుతున్నారు’ అని అగార్కర్‌‌‌‌‌‌‌‌వివరించాడు. గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌స్థానంలో రవీంద్ర జడేజాకు వైస్‌‌‌‌‌కెప్టెన్సీ అప్పగించారు. సౌతాఫ్రికాతో సిరీస్‌‎కు పంత్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉండే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని చెప్పాడు.  పేసర్‌‌‌‌‌‌‌‌ మహ్మద్‌‌‌‌‌‌‌‌షమీపై ఎలాంటి అప్‌‌‌‌‌‌‌‌డేట్‌లేదని అగార్కర్‌‌‌‌‌‌‌చెప్పాడు.

జట్టు: శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌), యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌, కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌, సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌, దేవదత్‌‌‌‌‌‌‌‌ పడిక్కల్‌‌‌‌‌‌‌‌, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ జురెల్‌‌‌‌‌‌‌‌, రవీంద్ర జడేజా (వైస్​ కెప్టెన్​),  వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రా, అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌, నితీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, ఎన్‌‌‌‌‌‌‌‌. జగదీశన్‌‌‌‌‌‌‌‌, మహ్మద్‌‌‌‌‌‌‌‌ సిరాజ్‌‌‌‌‌‌‌‌, ప్రసిధ్‌‌‌‌‌‌‌‌ కృష్ణ, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌.