టెర్రరిస్టుల అటాక్.. ఇద్దరు జవాన్లు, ఎస్‌పీవో మృతి

టెర్రరిస్టుల అటాక్.. ఇద్దరు జవాన్లు, ఎస్‌పీవో మృతి

శ్రీనగర్: సీఆర్‌‌పీఎఫ్‌ జవాన్లతోపాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులపై టెర్రరిస్టులు అటాక్ చేశారు. నార్త్‌ కాశ్మీర్‌‌, బారాముల్లాలోని క్రీరి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఓ పోలీస్ ఆఫీసర్‌‌తోపాటు ఇద్దరుసీఆర్‌‌పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టులను పట్టుకునేందుకు సీఆర్‌‌పీఎఫ్ సెర్చ్ ఆపరేషన్స్‌, కార్డన్ సెర్చ్ చేపట్టింది. సీఆర్‌‌పీఎఫ్ జవాన్లు తమ వాహనంలో నుంచి బయటకు దిగుతుండగా ఈ అటాక్ జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో కాశ్మీర్ పోలీస్‌కు చెందిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌పీవో) మృతి చెందాడు. ‘ఇవ్వాళ బారాముల్లాలో జరిగిన అటాక్‌లో ఇద్దరు సీఆర్‌‌పీఎఫ్ జవాన్లు గాయాలపాలయ్యారు’ అని జమ్మూ కాశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.