
దాదాపు ఇరవయ్యేళ్ల క్రితం ‘మల్లీశ్వరి’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్.. ఆ తర్వాత బాలకృష్ణతోనూ ఒక సినిమా చేసింది. తర్వాత తెలుగులో నటించకపోయినా ఇప్పటికీ ఆమెకి ఇక్కడ అదే క్రేజ్ ఉంది. అందుకే కత్రినా సినిమాలపై ఓ కన్ను వేసే ఉంచుతారు సౌత్ ప్రేక్షకులు. లాస్ట్ ఇయర్ ‘సూర్యవంశీ’ మూవీతో ఓ హిట్ను తన బ్యాగ్లో వేసుకున్న కత్రినా చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ‘ఫోన్ భూత్’ సినిమా ముందు రిలీజవుతోంది. ‘మీర్జాపూర్’ ఫేమ్ గుర్మీత్ సింగ్ రూపొందించిన ఈ చిత్రంలో కత్రినాతో పాటు సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖత్తర్ లీడ్ రోల్స్లో నటించారు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకి కత్రినా బర్త్డే గిఫ్ట్గా జులై 15న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ని కూడా మార్చేశారు. అక్టోబర్ 7న రిలీజ్ చేయనున్నట్టు నిన్న కన్ఫర్మ్ చేశారు. రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్ నిర్మించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, షీబా చద్ధా, సురేందర్ ఠాకూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా విషయంలో కత్రినా చాలా ఎక్సయిటవుతోంది. ఎందుకంటే ఇది తన కెరీర్లో మొట్టమొదటి హారర్ మూవీ. చాలా డిఫరెంట్ లుక్లో కనిపించబోతోందట. మరోవైపు మెర్రీ క్రిస్మస్, టైగర్ 3 చిత్రాల్లోనూ నటిస్తోంది కత్రినా. ‘మెర్రీ క్రిస్మస్’లో తనకి జోడీగా విజయ్ సేతుపతి నటిస్తూ ఉండటం విశేషం.