మహిళలకు కవిత క్షమాపణ చెప్పాలి: రాణిరుద్రమ

మహిళలకు కవిత క్షమాపణ చెప్పాలి: రాణిరుద్రమ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ చూసి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ నుంచి దేశ ప్రజలను పక్కదారి పట్టించేందుకే కవిత మహిళా రిజర్వేషన్ దీక్ష పేరుతో ఢిల్లీలో డ్రామా ఆడినట్లు దీంతో రుజువైందని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె విమర్శించారు. 

ఏడుగురు మహిళలకు మాత్రమే టికెట్ లు ఇచ్చిన మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. జనాభా లో 50 శాతం  ఉన్న మహిళలకు గులాబీ పార్టీ 6శాతం  టికెట్ లు ఇస్తూ, దేశ వ్యాప్తంగా పార్టీ కమిటీ లల్లో మహిళలకు 30శాతం  రిజర్వేషన్ ఇస్తున్న బీజేపీ మీద పోరాటం చేస్తాననడం సిగ్గుచేటని అన్నారు.