రాజకీయ కక్షతోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత

రాజకీయ కక్షతోనే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్​ వైఫల్యాలను ఎండగడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు మళ్లీ నోటీ సులు ఇచ్చారు’’ అని శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

 కాగా, షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం వేడుకలకు ప్రభుత్వం నిధులివ్వాలని కవిత డిమాండ్​ చేశా రు. ఈ మేరకు శుక్రవారం ఆమె మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​తో ఫోన్​లో మాట్లాడారు.