
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘‘రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మళ్లీ నోటీ సులు ఇచ్చారు’’ అని శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.
కాగా, షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం వేడుకలకు ప్రభుత్వం నిధులివ్వాలని కవిత డిమాండ్ చేశా రు. ఈ మేరకు శుక్రవారం ఆమె మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో ఫోన్లో మాట్లాడారు.