కేసీఆర్ కాగితపు పులి..ఆయన కథ ముగిసింది

కేసీఆర్ కాగితపు పులి..ఆయన కథ ముగిసింది

కేసీఆర్ ఎక్కడ పోటీ చేసినా..అక్కడికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా పాటపాడతానని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు.  సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరం కలిసి కేసీఆర్ ను కూలుద్దాం అని పిలుపునిచ్చారు. వాజ్ పేయి కలిశారు. అమిత్ షా పలుకరించారు. అంబానీ కూడా సమయం ఇస్తారు కానీ..కేసీఆర్ మాత్రం కలవడని..గేట్ దగ్గరే ఆపేస్తారని మండిపడ్డారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో పదేండ్ల తెలంగాణను దండుకున్నది ఎవరు? దగా పడ్డి ఎవరు.? అనే అంశంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ లో గద్దర్ పాల్గొన్నారు. 

ప్రజల కోసం ఏమీ చేయలేకపోయానని..ప్రజలంతా తనను క్షమించాలని గద్దర్ కోరారు. తెలంగాణను బాగు చేసుకోవాలంటే..అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలంటే అందరం కలిసి కేసీఆర్ను గద్దె దించాలన్నారు. టార్గెట్ కేసీఆర్ లాగా పనిచేయాలని చెప్పారు. కేసీఆర్ ఒక కాగితపు పులి అని..వాడి ఎరా ముగిసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.