రేపు  (సెప్టెంబర్ 6) ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్

రేపు  (సెప్టెంబర్ 6) ఫామ్హౌస్లో బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్
  • అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నేతలకు కేసీఆర్​ దిశానిర్దేశం

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్​పార్టీ సన్నద్ధమవుతున్నది. ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్​లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్​.. బీఆర్ఎస్​ఎల్పీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న సభలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని కేసీఆర్​ఇప్పటికే అందరికీ సమాచారమిచ్చారు.

ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యం, 22ఏ జాబితా, హైడ్రా కూల్చివేతలు, ఉద్యోగాలు వంటి అంశాలపై ఫోకస్​పెట్టనున్నారు. కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలపై ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సమావేశంలో కేసీఆర్​దిశానిర్దేశం చేయనున్నారు. అయితే, సీఎం రేవంత్​రెడ్డి సవాల్​మేరకు కేసీఆర్ ఈసారైనా అసెంబ్లీకి వస్తారా అంటే రారనే సమాధానాలే వస్తున్నాయి. ఇటీవల కాంగ్రెస్​ వెయ్యి రోజుల పాలనపై చార్జిషీట్​విడుదల సందర్భంగా.. కేసీఆర్​అసెంబ్లీకంటూ వస్తే మళ్లీ సీఎంగానేనని కేటీఆర్​తేల్చి చెప్పారు.