
గచ్చిబౌలి, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఎంపీ సంతోశ్ కుమార్, పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు.
కేసీఆర్ కు ఏఐజీ ఆసుపత్రి డాక్టర్లు పలు మెడికల్ టెస్టులు నిర్వహించారు. రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు బీఆర్ఎస్ నాయకుల ద్వారా తెలిసింది.