కేసీఆర్: 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే

కేసీఆర్: 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే

కరీంనగర్ నుంచి లోక్ సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో.. లోక్ సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17న కరీంనగర్,  19న నిజామాబాద్ లో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒక్కో సభకు రెండు లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేయాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఎంపీలను గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. MIM పోటీ చేసే హైదరాబాద్ తో పాటు.. మిగతా 16 సీట్లు గెలిచి తీరాల్సిందేనని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.