
2023లో విడుదలైన కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్-1 విజయం సాధించడంతో.. ఇప్పుడు సీజన్–2ని రిలీజ్ చేశారు. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ (జూన్ 20న) జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
ప్రస్తుతం ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ జియోహాట్స్టార్లో (JioHotstar) దూసుకెళ్తోంది. డైరెక్టర్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని.. కరెక్ట్ విధానంలో కథను పొందుపరిచారు. చివరి క్షణం వరకు ఉత్కంఠ రేపే సీన్స్తో ప్రేక్షకులను ఆసక్తిగా ఉండేలా.. ఓ మిస్సింగ్ కేసుని ఇన్వెస్టిగేట్ చేశాడు.
మలయాళంలో కంటే తెలుగులోనే అత్యథిక వ్యూస్తో ఈ క్రైమ్ ఫైల్స్ ట్రెండింగ్లో ఉంది. ఇందులో ఇంద్రన్స్, హరిశ్రీ అశోకన్, సిరాజుద్దీన్ నాజర్, అర్జున్ రాధాకృష్ణన్, లాల్, అజు వర్గీస్, నవాస్ వల్లికున్ను, సంజు సానిచెన్, శిబ్లా ఫరా పాత్రల్లో నటించారు.
Kerala Crime Files: Season 2 is earning great reviews all around.
— JioHotstar Malayalam (@JioHotstarMal) June 23, 2025
Kerala Crime Files Season 2 will be streaming soon on JioHotstar!#HotstarSpecials #KeralaCrimeFilesSeason2 #Trailer #KeralaCrimeFilesS2 #KCF2 #KCF #JioHotstar #JioHotstarMalayalam #Investigation #Crime #Thriller… pic.twitter.com/2QmInM0RBG
కథేంటంటే:
మొదటి సీజన్లో కథ.. ఓ వేశ్య మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఈ సీజన్ కథలోకి వెళ్తే.. కేరళలోని ఒక పోలీస్ స్టేషన్లో పని చేసే అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తాయి. దాంతో వాళ్లందర్నీ వేరే చోట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ల ప్లేస్లో కొత్తవాళ్లను నియమిస్తారు.
అయితే.. బదిలీపై అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన అంబులి రాజు (ఇంద్రన్స్) అనే ఓ సిన్సియర్ కానిస్టేబుల్ కనిపించకుండా పోతాడు. దాంతో ఆ స్టేషన్కు కొత్తగా వచ్చిన సీఐ కురియన్ (లాల్), ఎస్సై నోబుల్ (అర్జున్ రాధాకృష్ణన్) దర్యాప్తు మొదలుపెడతారు. అంబిలి రాజు ఆచూకీ కనిపెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వారి ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ క్రైమ్స్ ఏంటీ? చివరికి అంబిలి రాజు ఆచూకీ కనిపెట్టారా? లేదా అనేది మిగతా కథ.