కేరళ వ్యక్తికి జాక్‌పాట్.. దుబాయ్ లాటరీలో రెండోసారి రూ.8కోట్ల 50 లక్షలు..

కేరళ వ్యక్తికి జాక్‌పాట్.. దుబాయ్ లాటరీలో రెండోసారి రూ.8కోట్ల 50 లక్షలు..

ఎవరికైనా లాటరీలో ఒక్కసారి పెద్ద మెుత్తంలో డబ్బులు రావటమై జీవితకాలంలో పెద్ద అదృష్టంగా పరిగణించబడుంది. అయితే దేవుడి దయ ఉంటే డబ్బుల వర్షం జీవితంలో కురుస్తుందని పెద్దవాళ్లు చెబుతుండేవారు. ఈ కేరళ వ్యక్తి జీవితంలో ఇది నిజంగానే నిజమైందని చూసినవారందరూ అంటున్నారు. 

తాజాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి దుబాయ్ లాటరీలో రెండోసారి మిలియన్ డాలర్లు బహుమతిగా గెలుచుకున్నాడు. భారత కరెన్సీ ప్రకారం గెలిచిన మెుత్తం విలువ రూ.8కోట్ల 50 లక్షలకు సమానం. 60 ఏళ్ల పాల్ జోస్ మోవెలి అనే వ్యక్తి 1999 నుంచి దుబాయ్ లోనే ఉపాధి పొందుతూ నివసిస్తున్నారు. అతనికి ఉన్న లాటరీలు కొనే అలవాటు నిజంగా అతని జీవితాన్ని మార్చేసింది. తాజాగా రెండోసారి కూడా ఆయనకు లాటరీలో భారీ మెుత్తం చేతికి రావటంతో ఈ కేరళ వ్యక్తి పేరు మారుమోగుతోంది.

 

లాటరీ విజేతకు సంబంధించిన వివరాలను దుబాయ్ డ్యూటీ ఫ్రీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. పాల్ జోస్ మావెలి రెండోసారి మిలియన్ డాలర్ల బహుమతిని గెలుచుకున్నట్లు వెల్లడించింది. ఈసారి పాల్ తన 17 మంది స్నేహితులతో కలిసి డ్యూటీ ఫ్రీ లాటరీని కొన్నట్లు వెల్లడైంది. మే 19న కొన్న 3532 లాటరీ నంబరుకు ప్రస్తుతం పెద్ద బహుమతి ప్రకటించారు. 

దీనికి ముందు ఈ వృద్ధుడు 2016లో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి లాటరీని కొన్నాడు. అప్పుడు కూడా తాను గెలుచుకున్న తన మిత్రులతో కలిసి పంచుకోగా.. ఈసారి కూడా అదే పద్ధతిలో ముందుకెళ్లనున్నాడు. పాల్ జోస్ ప్రస్తుతం ఒక దుబాయ్ నిర్మాణ సంస్థలో సూపర్ వైజర్ ఉద్యోగం చేస్తున్నాడు. వాస్తవానికి లాటరీ టిక్కెట్ విలువ రూ.22వేలు ఉండటంతో పాల్ తన సహచరులతో కలిసి దీనిని కొంటుంటాడని తేలింది. ఈ డ్యూటీ ఫ్రీ లాటరీ టిక్కెట్లను విమానాశ్రయంలో లేదా అధికారికి వెబ్ సైట్ ద్వారా కొనుక్కోవచ్చు. 1999 నుంచి ఇప్పటి వరకు ఈ లాటరీలో 251 మంది భారతీయ విజేతలు డబ్బు గెలుచుకోవటం గమనార్హం.