ఎఫ్​సీఐకి బియ్యం అందించాలి : డి. మధుసూదన్ నాయక్

ఎఫ్​సీఐకి బియ్యం అందించాలి : డి. మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్, వెలుగు :  2023–24 సంవత్సరం ఖరీఫ్ మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యం సీఎంఆర్​ నిబంధనల మేరకు ఎఫ్​సీఐకి బియ్యం అందించాలని ఖమ్మం అడిషనల్​ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు.  బుధవారం న్యూ కలెక్టరేట్ లో రైస్ మిల్లర్లు, ఎఫ్​సీఐ అధికారులతో సీఎంఆర్ రైస్ పై ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎంఆర్ బియ్యం తరలింపులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు. రైస్ మిల్లర్లకు ఇవ్వాల్సిన గోనె సంచులు, ఎఫ్​సీఐ వారి వద్ద బియ్యం దిగుమతి కోసం సరిపడు స్థలం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నెలాఖరుకు రైస్ మిల్లర్లందరూ ఇవ్వాల్సిన బియ్యం ఎఫ్​సీఐకి అప్పగించాలని ఆదేశించారు.