ఖర్గే సభ ఆగస్టు 24కు వాయిదా.. వేదిక జహీరాబాద్ నుంచి చేవెళ్లకు మార్పు

ఖర్గే సభ ఆగస్టు 24కు వాయిదా.. వేదిక జహీరాబాద్ నుంచి చేవెళ్లకు మార్పు

హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ వాయిదా పడింది. అనివార్య పరిస్థితుల్లో సభను వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్​ పార్టీ ప్రకటించింది. తేదీతో పాటు సభా వేదికనూ మార్చింది. తొలుత జహీరాబాద్​లో ఈ నెల 18న ఖర్గే సభ ఉంటుందని రెండు రోజుల క్రితం ప్రకటించగా.. ఇప్పుడు ఆ సభను చేవెళ్లకు మార్చి, డేట్​ను 24కు సెట్​చేశారు.
 సోమవారం చేవెళ్ల నియోజ కవర్గానికి చెందిన పార్టీ సభ్యులతో కాంగ్రెస్​ స్టేట్​ ఇన్​చార్జ్​ మాణిక్​ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్​రేవంత్​ సమావేశ మయ్యారు. చేవెళ్ల సభపై వారితో చర్చిం చారు. సభను విజయవంతం చేయాలని సూచించారు. ఖర్గే సభలోనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్​ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. 
ఇటీవల బీజేపీకి రాజీ నామా చేసిన ఏ చంద్రశేఖర్​ కాంగ్రెస్​ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలి సింది. రెండు రోజుల కిందట చంద్రశేఖర్​ ఇంటికి రేవంత్​వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్​లో చేరుతానంటూ చంద్రశేఖర్​ కూడా ప్రకటించారు.