తెలంగాణ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని.. ఫిబ్రవరి 1 గడిచిపోయింది కానీ.. గ్రూప్-1 నోటిఫికేషన్ రాలేదని విమర్శించారు. నమ్మి ఓటేసిన యువతను నిట్టనిలువునా మోసం చేసిందని.. ఇతర హామీలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం చేస్తోందిని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింది. మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హామీలు ఇచ్చి మోసం చేసే ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
Also read :- మల్కాజిగిరి ఎంపీ సీటుకు బండ్ల గణేష్ దరఖాస్తు
నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందన్నారు. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. బీజేపీ యాత్రలు, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సమ్మేళనం, మహిళ స్వయం సహాయక సంఘాల సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, అయోధ్య దర్శన్, గోడ వ్రాతలు, వికసిత భారత్ సంకల్ప అంబాసిడర్ కార్యక్రమాలపై చర్చ నిర్వహించారు.