కల్వకుంట్ల ఫ్యామిలీ తీపి మాటలు చెప్పి గొంతులు కోస్తారు -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల ఫ్యామిలీ తీపి మాటలు చెప్పి గొంతులు కోస్తారు -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల ఫ్యామిలీ తీపి మాటలు చెప్పి గొంతులు కోస్తారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో ఫాంహౌస్ లో కూర్చున్న కేసీఆర్ కే తెలియాలన్నారు.  కల్వకుంట్ల కుటుంబం మాటలు తీయగా ఉంటాయి కానీ గొంతులు కోసే రకమని ధ్వజమెత్తారు.  బంగారు తెలంగాణలో  రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. కౌలు రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కల్తీ విత్తనాలకు గులాబీ దండే కారణమని.. వారిపై ఎన్ని కేసులు పెట్టారో కేసీఆర్ చెప్పాలన్నారు.  రైతుల కోసం పుట్టినా అని చెప్పిన కేసీఆర్..ఉచిత ఎరువులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఉచిత ఎరువుల  హామీ ఏమైందన్నారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పేందుకే పుట్టిండని విమర్శించారు.