
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే కేసీఆర్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని కిషన్ రెడ్డి అన్నారు. వందరోజుల్లో నిజామ్ షుగర్ ఫాక్టరీ తెరిపిస్తామన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ పేరుతో గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారని, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే నైతిక విలువ కేసీఆర్కు లేదని కిషన్ రెడ్డి మండి పడ్డారు.
రాష్ట్రంలో మూతబడ్డ అన్నీ ఫాక్టరీలు తెరుస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదో ప్రశ్నించాడు. నాలుగేండ్లయినా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం మొదలుపెట్టలేదని, తొమ్మిదేండ్లయినా హామీలిచ్చిన పనుల్లో ఒక్క కూడా అడుగు ముందుకు పడలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ పాలనను కేసీఆర్ గాలికొదిలేసిన కేసీఆర్.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమైనా తెరిచారా చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహానికి ఏనాడూ నివాళులు అర్పించని కేసీఆర్.. ఎన్నికల కోసమే ముందుకు వచ్చి పనులు చేస్తున్నారపి విమర్శించారు.