జవాన్ల కుటుంబాలను ఆదుకొనే గొప్ప కార్యక్రమం సైనిక్ వందన్

జవాన్ల కుటుంబాలను ఆదుకొనే  గొప్ప కార్యక్రమం సైనిక్ వందన్

ఆర్మీ జవాన్ల కుటుంబాలను ఆదుకొనే గొప్ప కార్యక్రమం సైనిక్ వందన్ అన్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారత ప్రభుత్వం సైనికులకు అండగా ఉంటుందన్నారు. BVP చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.. కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన సైనిక్ వందన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు సాయం చేయాలనే ఉద్దేశంతో... భారత్ వికాస్ పరిషద్ కృషి చేస్తుందన్నారు నిర్వాహకులు.