సుష్మా సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరు: కిషన్ రెడ్డి

సుష్మా సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరు: కిషన్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు. సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆమె అందించిన సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఆమె తపించేవారని… తమలాంటి వారికి ఆమె స్ఫూర్తిప్రదాత అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు కిషన్ రెడ్డి.