నవంబర్ 1న బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల : కిషన్ రెడ్డి

నవంబర్ 1న బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల : కిషన్ రెడ్డి

నవంబర్ 1వ తేదీన బీజేపీ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేస్తామని చెప్పారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్​రెడ్డి. నవంబర్ 1న జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంటుందన్నారు. సీఈసీ మీటింగ్ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు. అందరి అభిప్రాయాలు స్వీకరించాకనే... అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

జనసేన పార్టీతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయన్నారు. జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అని చెప్పారు. ఒకేసారి సమగ్రమైన మేనిఫెస్టో విడుదల చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం మేనిఫెస్టోపై కసరత్తు జరుగుతోందన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులకు స్పేస్ లేదన్నారు.