‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సహకారం: మంత్రి కిషన్ రెడ్డి

‘అష్టలక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సహకారం:  మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా దేశ అభివృద్ధి సంపూర్ణం కాదని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. నిరాదరణకు గురైన ‘అష్ట లక్ష్మి’ రాష్ట్రాలకు మోదీ సర్కారు అందుకే సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌‌లో జరిగిన ‘నార్త్ ఈస్ట్ సమ్మేళన్’ కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో నిర్మిస్తున్న నార్త్ ఈస్ట్ కల్చరల్ అండ్ సోషల్ ఇనిస్టిట్యూట్ కు శంకుస్థాపన చేయడంతోపాటు జేఎన్‌‌యూలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల కోసం నిర్మించిన ‘బరాక్’ హాస్టల్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన ప్రకృతి రమణీయతకు, భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఇప్పటి వరకు రూ.5 లక్షల కోట్లు కేటాయించిందని వెల్లడించారు.

ప్రతి కేంద్ర మంత్రిత్వ శాఖ బడ్జెట్ లో 10% నిధులను ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ లేని కారణంగా.. విస్తృతమైన అవకాశాలున్నా పర్యాటక రంగం పురోగతి సాధించలేకపోయిందన్నారు. మోదీ సర్కార్ హయాంలోనే నార్త్ ఈస్ట్ లో కనెక్టివిటీ గణనీయంగా పెరిగిందన్నారు. రోడ్డు, రైలు మార్గాలు, ఎయిర్ లైన్స్, టెలికాం సర్వీసులు పెరిగాయన్నారు. దేశంలో తొలి 5జీ ల్యాబ్స్ ను అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేశామన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఈశాన్య