సికింద్రాబాద్ లో నాదే గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ లో  నాదే గెలుపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: దేశంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ నడుస్తోందని, కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ సిటీ ఆఫీసులో నిర్వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి  బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలోనూ మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కృష్ణయాదవ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు.