చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవిని దర్శించుకున్న కిషన్ రెడ్డి

చార్మినార్ భాగ్యలక్ష్మీదేవిని దర్శించుకున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని మొక్కుకున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు రావాలని కోరుకున్నానని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రధాని మోడీ ఎంతో చేస్తున్నారన్న ఆయన.. ఉగ్రవాదం అంతమే లక్ష్యమన్నారు.

చార్మినగర్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం కోసం సామాన్య భక్తులతో పాటు వీఐపీలు క్యూకట్టారు.  గవర్నర్ తమిళి సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ,మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి అమ్మవారిని  దర్శించుకున్నారు.