అక్టోబర్ 11న మేడారానికి కిషన్ రెడ్డి

అక్టోబర్ 11న మేడారానికి కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ యూనివర్సిటీ శాంక్షన్ చేయటంతో పాటు దానికి  సమ్మక్క సారక్కల పేరు పెట్టినందుకు బుధవారం బీజేపీ రాష్ర్ట నేతలు ములుగు వెళ్లనున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు మేడారంలో సమ్మక్క సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు.