సింగరేణి ఆస్పత్రిలో ..మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్​

సింగరేణి ఆస్పత్రిలో ..మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని సింగరేణి మెయిన్​హాస్పిటల్​లో ఆదివారం మోకాలు చిప్ప ఆపరేషన్​ను డార్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. కృష్ణమూర్తి అనే పేషెంట్ కు సీఎంవో బి. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ల టీం విక్రమ్, రేష్మ, సువర్ణ, నాగరాజు, కృష్ణమూర్తి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్​చేయడంపై కంపెనీ డైరెక్టర్(పా) ఎన్.బలరాం అభినందించారు.

 కార్మికులు, కార్మిక కుటుంబాల ఆరోగ్యానికి యాజమాన్యం పెద్దపీట వేస్తోందని ఆయన గుర్తు చేశారు.