కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్​గా కోదండరెడ్డి : కేసీ వేణుగోపాల్

కిసాన్ కాంగ్రెస్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్​గా కోదండరెడ్డి : కేసీ వేణుగోపాల్
  • కొత్త కమిటీని ప్రకటించిన కేసీ వేణుగోపాల్

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ సీని యర్ నేత కోదండరెడ్డిని కిసాన్ కాంగ్రెస్ సెల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్​గా ఏఐసీసీ మరోసారి నియమించింది. శనివారం కిసాన్ కాంగ్రెస్ నేషనల్ సెల్ కొత్త కమిటీ ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగో పాల్ ప్రకటించారు. నేషనల్ వైస్ చైర్మ న్లుగా ఆరుగురిని, నేషనల్ కో ఆర్డినేట ర్లుగా 33 మందిని, నేషనల్ జాయింట్ కో ఆర్డినేటర్లుగా 36 మందిని

అధికార ప్రతినిధులుగా ముగ్గురిని ఏఐసీసీ నియ మించింది. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న కృషిని గుర్తించి తిరిగి అవకాశం కల్పించడం సంతోష కరమని కోదండ రెడ్డి శనివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే,  సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు కోదండరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.