- ప్రమాణం చేయకుండానే వెనక్కి
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసేందుకు మండలికి వెళ్లిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ సోమవారం నాలుగు గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ప్రమాణం చేయకుండానే వెనుదిరిగారు. మండలి చైర్మన్కు సమాచారం ఇవ్వకుండా రావడం వల్ల ఇలా జరిగింది.
అయితే, ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లో సంప్రదించినా ఆయన టచ్లోకి రాలేదని చెప్తున్నారు. కొద్ది రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే చైర్మన్ అందుబాటులో లేరని చెప్తున్నారు. దీంతో మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తామని, ఈ విషయాన్ని చైర్మన్కు చేరవేయాలని మండలి సెక్రటరీకి ఎమ్మెల్సీలు చెప్పారు. అయితే, గురువారం ప్రమాణానికి ఏర్పాట్లు చేసేలా చూడాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసింది.