ఇవాళ్టి నుంచి సిద్ధేశ్వరుని బ్రహోత్సవాలు

ఇవాళ్టి నుంచి సిద్ధేశ్వరుని బ్రహోత్సవాలు

బచ్చన్నపేట, వెలుగు : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని    కొడవటూరు సిద్దేశ్వరస్వామి  బ్రహోత్మవాలు బుధవారం నుంచి  నాలుగు రోజులపాటు జరుగనున్నాయి.  8న శివరాత్రిరోజు శివకల్యాణం సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్​రెడ్డి  పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.    బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం   అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వహకులు తెలిపారు.  సిద్దుల గుట్టకు రావడానికి జనగామ, బచ్చన్నపేట, హుస్నాబాద్​, ఆలేరు, సిద్దిపేట, గజ్వేల్​, యాదగిరిగుట్ట ప్రాంతాల నుంచి భక్తులకు బస్సు సౌకర్యం ఉంది. మండకేంద్రం బచ్చన్నపేటకు  వచ్చి సిద్దుల గుట్టకు చేరుకోడానికి ఆటోల సౌకర్యం ఉందంటున్నారు.