బాలీవుడ్ లోకి కోలీవుడ్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

బాలీవుడ్ లోకి కోలీవుడ్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya)  బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ సైతం మాతృ భాషతో పాటు ఇతర ఇండస్ట్రీలో మార్కెట్ పెంచుకుంటున్నాడు. ఇప్పుడు సూర్య సైతం బాలీవుడ్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

రంగ్ దే, బసంతి, భాగ్ మిల్కా భాగ్ సినిమాల డైరెక్టర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రాతో సూర్య లేటెస్ట్ ఫొటో ఒకటి బయటకువచ్చింది. వీరి కాంబోలో మూవీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ పీరియాడిక్ జానర్ లో తెరకెక్కనుండగా దీనికి 'కర్ణ' అనే టైటిల్ అనుకుంటుండగా దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు దర్శకుడు రాకేష్ ప్లాన్ చేస్తున్నారట. ఇక వీరిద్దరూ మీడియా కంటపడటంతో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరి కాంబోలో సినిమా చేస్తున్నారని ప్రచారం జోరందుకుంది.

ALSO READ: వీల్చైర్ లో వచ్చి జవాన్ సినిమా చూసిన వెంటిలేటర్ పేషెంట్

ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య కంగువ సినిమాతో బిజీగా ఉండగా..తర్వాత డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్టులో జాయిన్ అవ్వబోతున్నారని సమాచారం. సూర్య 43 టైటిల్‌గా వస్తోన్నఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనుంది. ఈ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ మ్యూజిక్  డైరెక్టర్ జీవి ప్రకాష్ అద్దిరిపోయే ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ మూవీ జీవి ప్రకాష్ కు 100వ మూవీ కావడంతో స్పెషల్ ట్యూన్స్ కంపొజిషన్ లో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. సుధ కొంగర తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోలీవుడ్ లోనే పెద్ద మల్టీస్టారర్ గా రాబోతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.