నిర్మలా సీతారామన్ సొంత డబ్బా కొట్టుకున్నారు: కోమటిరెడ్డి

నిర్మలా సీతారామన్ సొంత డబ్బా కొట్టుకున్నారు: కోమటిరెడ్డి

నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రసంగం సొంత డబ్బాలా ఉందని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.   గొప్పలు చెప్పుకునే ప్రయత్నం తప్ప సామన్య ప్రజలకు ఒరిగేదేమి లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం.. రాజకీయ ప్రసంగాన్ని తలపించింది కానీ, ఏ వర్గాన్ని సంతృప్తి చెందించలేకుండా పోయిందన్నారు. ఒక్క కొత్త సంక్షేమ పథకం గురించి కూడా బడ్జెట్ లో ప్రస్తావించలేదని మండిపడ్డారు. పన్నుల విషయంలో ఎలాంటి మార్పు లేదని చెప్పి అన్ని వర్గాల వారిని ఉసూరుమనిపించారని విమర్శించారు.

వ్యవసాయ రంగానికి తక్కువ కేటాయింపులు  రైతులకు మొండి చేయి చూపారని ధ్వజమెత్తారు కోమటిరెడ్డి.  డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నా.. సామాన్యుడిపై భారం తగ్గించే ప్రయత్నం చేయలేదన్నారు. ఎప్పటిలాగే తెలంగాణకు మరోసారి మొండి చేయి చూపారని విమర్శించారు.విభజన హామీల అమలు, హక్కుగా రావాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదన్నారు.