కొండా దంపతులు కాంగ్రెస్​ లోనే కొనసాగుతారు

కొండా దంపతులు కాంగ్రెస్​ లోనే కొనసాగుతారు

వరంగల్ సిటీ, వెలుగు: కొండా దంపతులు కాంగ్రెస్​ పార్టీని వీడేది లేదని, ఇతర పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్​ నాయకుడు కరాటే ప్రభాకర్​ బర్త్​ డే సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా దంపతులు కాంగ్రెస్​ లోనే కొనసాగుతారని, ప్రతి కార్యకర్తనూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.

కొండా సురేఖ వరంగల్​ తూర్పు నుంచే పోటీ చేస్తారని, తొందర్లోనే ఎంజీఎం ఆసుపత్రి నుంచి పాదయాత్ర కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తల బాధలో పాలుపంచుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కొంతమంది యువకులు కాంగ్రెస్​ లోకి చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.