వికారాబాద్కు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలె

వికారాబాద్కు కేసీఆర్ ఏం చేసిండో చెప్పాలె

జనగామ: సీఎం కేసీఆర్పై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణకు ప్రథమ శత్రువు కేసీఆర్ అని అన్నారు. వికారాబాద్ కు బీజేపీ ఏం  చేసిందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి ముందు తానేం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల నిధులు, విధులను కేసీఆర్ హరిస్తున్నారని కొండా విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. అందుకే మునుగోడు నియోజకవర్గ సర్పంచ్లు బిజేపి లో చేరేందుకు క్యూ కట్టారని అన్నారు.

ప్రధాని మోడీ రైతు రుమాలు కట్టుకుంటే కేసీఆర్ వెక్కిరించడాన్ని కొండా విశ్వేశ్వర రెడ్డి తప్పుబట్టారు. ఉచిత విద్యుత్ ఇవ్వవద్దని ప్రధాని ఎక్కడా చెప్పలేదని, ఇచ్చేది సక్రమంగా ఇవ్వాలని మాత్రమే కోరారని చెప్పారు. ముఖ్యమంత్రి పిట్టల దొరలా, తుపాకీ రాముడిలా వ్యవహరిస్తున్నాడన్న ఆయన.. కేసీఆర్ టోపీకి తగ్గ తుపాకీ పంపుతున్నట్లు చెప్పారు.