కొండగట్టు అంజన్నకు వెయ్యి కొబ్బరి కాయలు

కొండగట్టు  అంజన్నకు వెయ్యి కొబ్బరి కాయలు

కొండగట్టు, వెలుగు: కోమాలోకి వెళ్లిన కుటుంబ సభ్యుడు తిరిగి కోలుకోవడంతో ఓ కుటుంబం ఆదివారం కొండగట్టు అంజన్నకు వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకుంది. పెద్దపల్లి జిల్లా 8​ఇంక్లైన్ కాలనీకి చెందిన ఇంద్రసేన గౌడ్ కొడుకు అఖిల్ గౌడ్ సాఫ్టవేర్​ఎంప్లాయ్. పని నిమిత్తం హిమాచల్ ప్రదేశ్​కు వెళ్లిన అఖిల్​అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోమాలోకి వెళ్లాడు. రెండేండ్ల తర్వాత ఇటీవల అఖిల్ కోలుకున్నాడు. 

నెలరోజుల్లో నార్మల్​అవడంతో, అతని ఫ్యామిలీ ఆదివారం కొండగట్టుకు చేరుకుని అంజన్నకు 1000 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంది. అంజన్న దయతోనే తన కొడుకు పూర్తిగా కోలుకున్నాడని ఇంద్రసేన తెలిపాడు.