కొండగట్టులో విజిలెన్స్ తనిఖీలు

కొండగట్టులో విజిలెన్స్ తనిఖీలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం విజిలెన్స్ సీఐ ప్రశాంత రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం తయారు చేసే కేంద్రంలో రికార్డులు పరిశీలించి, లడ్డూ నాణ్యత పరిమాణాలను చెక్​ చేశారు. 2022 నుంచి 2025 కి సంబంధించిన పలు రికార్డులను వారు పరిశీలించారు. 

ఆలయంలో టెండర్ ద్వారా నిర్వహిస్తున్న దుకాణాలకు సంబంధించిన చెల్లింపులు, ధరల వివరాలు, అగ్రిమెంట్లను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో టెంపుల్ సూపరిండెంట్ చంద్రశేఖర్ తదితరులున్నారు.