హైదరాబాద్, వెలుగు : కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. బుధవారం బేగంపేట క్యాంపు ఆఫీస్లో బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్ఫ్లోర్లీడర్శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బోయిన విజయ్కుమార్, పి. సత్యనారాయణ చారి, రాజకుమారి, సమైక్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్పిడుగు శ్రీనివాస్తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వర్రావు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.