బీఆర్ఎస్​లోకి కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు

బీఆర్ఎస్​లోకి కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు

హైదరాబాద్, వెలుగు :  కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు బీఆర్ఎస్​లో చేరారు. బుధవారం బేగంపేట క్యాంపు ఆఫీస్​లో బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపల్​ఫ్లోర్​లీడర్​శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు బోయిన విజయ్​కుమార్, పి. సత్యనారాయణ చారి, రాజకుమారి, సమైక్య, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ పట్టణ కన్వీనర్​పిడుగు శ్రీనివాస్​తదితరులు బీఆర్ఎస్​లో చేరారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వర్​రావు గెలుపునకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.