రెండు నెలల్లో ఎకో పార్క్ ప్రారంభం

రెండు నెలల్లో ఎకో పార్క్ ప్రారంభం
  • సీఎం రేవంత్​ వస్తారని,  ఏర్పాట్లు చేయాలన్న సీఎస్
  • కొత్వాల్​గూడ పార్కును సందర్శించిన రామకృష్ణా రావు  
  • బుద్వేల్​, కోకాపేట  లేఅవుట్ల పరిశీలన 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ కొత్వాల్​గూడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఎకోపార్క్​ను రెండు నెలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చీఫ్​సెక్రటరీ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్వాల్​గూడలో ఏర్పాటు చేసిన ఎకోపార్క్​ను విజిట్​చేశారు.  85 ఎకరాల విస్తీర్ణంలో రూ. 75 కోట్లతో నిర్మించిన ఈ పార్కులో పక్షుల గూళ్లు, అరైవల్ ప్లాజా, ఇతర ల్యాండ్​స్కేప్ సదుపాయాలను పరిశీలించారు. 

రెండు నెలల్లో సీఎం ప్రారంభిస్తారని, ఏర్పాట్లు చేయాలన్నారు. తర్వాత హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. ఈ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ గురించి హెచ్ఎండీఏ కమిషనర్​సర్ఫ్ రాజ్​అహ్మద్​వివరించారు. తర్వాత సీఎస్​ కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. దీన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

హెచ్ఎండీఏ కమిషనర్​తో పాటు, మున్సిపల్​శాఖ ప్రిన్సిపల్​సెక్రటరీ ఇలంబరితి, రంగారెడ్డి కలెక్టర్​పాల్గొన్నారు. అంతకుముందు సీఎస్​శంషాబాద్​మున్సిపాలిటీపై సమీక్షించారు. మున్సిపాలిటీ పరిధితో పాటు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.