
- సీఎం రేవంత్ వస్తారని, ఏర్పాట్లు చేయాలన్న సీఎస్
- కొత్వాల్గూడ పార్కును సందర్శించిన రామకృష్ణా రావు
- బుద్వేల్, కోకాపేట లేఅవుట్ల పరిశీలన
హైదరాబాద్సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ కొత్వాల్గూడలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఎకోపార్క్ను రెండు నెలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చీఫ్సెక్రటరీ రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్వాల్గూడలో ఏర్పాటు చేసిన ఎకోపార్క్ను విజిట్చేశారు. 85 ఎకరాల విస్తీర్ణంలో రూ. 75 కోట్లతో నిర్మించిన ఈ పార్కులో పక్షుల గూళ్లు, అరైవల్ ప్లాజా, ఇతర ల్యాండ్స్కేప్ సదుపాయాలను పరిశీలించారు.
రెండు నెలల్లో సీఎం ప్రారంభిస్తారని, ఏర్పాట్లు చేయాలన్నారు. తర్వాత హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న బుద్వేల్ లేఅవుట్ను సందర్శించారు. ఈ లేఅవుట్ గురించి హెచ్ఎండీఏ కమిషనర్సర్ఫ్ రాజ్అహ్మద్వివరించారు. తర్వాత సీఎస్ కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్ను సందర్శించారు. దీన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
హెచ్ఎండీఏ కమిషనర్తో పాటు, మున్సిపల్శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ ఇలంబరితి, రంగారెడ్డి కలెక్టర్పాల్గొన్నారు. అంతకుముందు సీఎస్శంషాబాద్మున్సిపాలిటీపై సమీక్షించారు. మున్సిపాలిటీ పరిధితో పాటు జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.