బాహుబలిని మించిన మూవీ తీస్తా

బాహుబలిని మించిన మూవీ తీస్తా

ముంబై: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మరోసారి వార్తల్లో నిలిచాడు. హిందీ బెల్ట్లో సంచలన రికార్డులు నమోదు చేస్తున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్–2 సినిమాలు డిజాస్టర్లంటూ కేఆర్కే చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు మరోసారి ఆయన వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకుముందు తాను తీసిన దేశ్ద్రోహి అనే సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు. ఇందులో పెద్దగా విశేషం ఏముందని అనుకుంటున్నారా?. భారతీయ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా చెప్పుకునే బాహుబలికి మించిన రేంజ్లో దేశ్ద్రోహి–2 ను తెరకెక్కిస్తున్నట్లు కేఆర్కే చెప్పడమే. త్వరలో ఈ మూవీని పట్టాలెక్కించనున్నట్లు ట్విట్టర్ లో ఆయన ప్రకటించాడు. 

‘స్వీయ నిర్మాణంలో ఓ చిత్రాన్ని తీస్తున్నా. ఈ సినిమా ద్వారా బాలీవుడ్కు బ్లాక్బస్టర్ ఫిల్మ్ ఎలా తీయాలో నేర్పిస్తా. త్వరలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది’ అని కేఆర్కే ట్వీట్ చేశాడు. ఈ దేశ్ద్రోహి–2లో ప్రధాన పాత్రలో నటించనున్న కేఆర్కే.. ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించనున్నాడు. జగదీష్ ఏ శర్మ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. 2008లో రిలీజైన దేశ్ద్రోహికి సీక్వెల్గా ఇది తెరకెక్కనుంది. దేశ్ద్రోహి–1లో కేఆర్కేతోపాటు ప్రముఖ నటుడు మనోజ్ తివారీ, హృషితా భట్, గ్రేసీ సింగ్, జుల్ఫీ సయ్యద్ కూడా యాక్ట్ చేశారు. ముంబైలో వలసదారులు ఎదుర్కొన్న సమస్యల చుట్టూ ఈ మూవీ కథ నడుస్తుంది. ఈ చిత్రంలో కేఆర్కే నటనపై ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ నడుస్తుండటం గమనార్హం.

మరిన్ని వార్తల కోసం:

నారాయణ్ దాస్ నారంగ్ ఇకలేరు

లాక్​డౌన్​ తర్వాత షాంఘైలో ఫస్ట్​ డెత్

ట్విట్టర్లో మరోసారి కేంద్రంపై కేటీఆర్ విమర్శలు