ఇన్సెంటివ్స్ అంశంపై జూన్‌ 27న కృష్ణా బోర్డు మీటింగ్

ఇన్సెంటివ్స్ అంశంపై జూన్‌ 27న  కృష్ణా బోర్డు మీటింగ్

హైదరాబాద్, వెలుగు:  ఇన్సెంటివ్స్​ అంశంపై కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నెల 27న జలసౌధలో రెండు రాష్ట్రాల అధికారులతో ఈ భేటీ జరగనుంది. ఈ మేరకు శనివారం రెండు రాష్ట్రాలకు కేఆర్​ఎంబీ చైర్మన్​ లేఖ రాశారు. అధికారులకు ఇచ్చిన ఇన్సెంటివ్స్​ను రద్దు చేయొద్దని కృష్ణా బోర్డుకు ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సమావేశాన్ని నిర్వహించనుంది. బోర్డుల్లో డిప్యూటేషన్​పై పనిచేస్తున్న అధికారులకు బేసిక్​ శాలరీపై 25 శాతం ఇన్సెంటివ్స్​ను అమలు చేయాలని బోర్డు గతంలో నిర్ణయించింది. 

అందుకు తగ్గట్టు  రెండేండ్ల పాటు ఇన్సెంటివ్స్​ను ఇచ్చింది. అయితే, బోర్డులు కేంద్ర ప్రభుత్వ సర్వీస్​ రూల్స్​కు తగ్గట్టు పనిచేయాలని కేంద్ర జలశక్తి శాఖ సూచించింది. ఇన్సెంటివ్స్​ ఇవ్వొద్దని, ఇచ్చిన ఇన్సెంటివ్స్​ను ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని ఆదేశించింది. దీనిపై పలువురు ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా.. రికవరీ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అధికారులకు ఇప్పటికే చెల్లించిన ఇన్సెంటివ్స్​ను రికవరీ చేయొద్దని, మున్ముందు చెల్లించాలా వద్దా అన్నది బోర్డు ఇష్టమని స్పష్టం చేసింది.