చేవెళ్లలో కుటుంబపాలనను అంతం చేస్తం : కేఎస్ రత్నం

చేవెళ్లలో కుటుంబపాలనను అంతం చేస్తం : కేఎస్ రత్నం

చేవెళ్ల, వెలుగు : చేవెళ్ల గడ్డపై బయటి నేతల పెత్తనం ఏంటని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కేఎస్‌‌ రత్నం ప్రశ్నించారు. వరంగల్​కు చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్​కు చెందిన ఎమ్మెల్యే ఆనంద్​ స్థానిక నేతలను ఎదగనిస్తలేరంటూ మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం చేవెళ్లలోని కేజీఆర్​ గార్డెన్ ​నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.

ముందుగా చేవెళ్ల టౌన్​లో  భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ..  తాను గెలిచినా గెలవకపోయినా చేవెళ్లలో కుటుంబ పాలనను అంతం చేయడమే లక్ష్యమన్నారు. సమావేశంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, నేతలు పాండు రంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, కిరణ్, రాములు గౌడ్  పాల్గొన్నారు.