దమ్ముందా?.. బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్

దమ్ముందా?.. బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్

ఐటీఐఆర్ రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాసిన లేఖకు కౌంటర్ గా లేఖ రాశారు మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా ITIR ప్రాజెక్టును పక్కనపెట్టింది BJP ప్రభుత్వమేనన్నారు కేటీఆర్. ITIR ప్రాజెక్టును పక్కన పెట్టామంటూ కేంద్రమంత్రి స్పష్టంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. సొంత పార్టీ మంత్రి చేసిన ప్రకటన బండి సంజయ్ కు తెలియకపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కేంద్రంలో, కర్ణాటకలో అధికారంలో ఉన్న బెంగళూరు ITIR కూడా ఒక్క అడుగు ముందుకు పోలేదన్నారు. 2014 నుంచి రాసిన లేఖలు, సమర్పించిన DPRలు సంజయ్ కు పంపిస్తానన్న కేటీఆర్…ITIR తీసుకువచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. లేకపోతే అందుకు సమానమైన ప్రాజెక్టును హైదరాబాద్ కు తీసుకురావాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ITIRపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలన్నారు. అసత్యాలు, అబద్దాలతో ప్రచారం చేస్తూ ప్రజలను BJP నేతలు తప్పు దోవ పట్టిస్తున్నారని KTR ఆరోపించారు.