
హైదరాబాద్: సికింద్రాబాద్, కంటోన్మెంట్ లో మూసివేసిన రోడ్లను తెరవాలని రిక్వెస్ట్ చేస్తూ..కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆర్మీ అధికారులు, మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటం లేదంటూ లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.