
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది వైట్పేపర్ కాదని.. అబద్ధాలతో కూడిన డాక్యుమెంట్అని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తప్పుడు సమాచారంతో ప్రాపగండ చేయడంపైనే ప్రభుత్వం ఫోకస్ చేసిందని ట్వీట్ చేశారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఇలాంటి అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారాలు చేయడం సిగ్గు చేటని కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వైట్పేపర్ఉందన్నారు. వృథా ఖర్చులు చేయమని చెప్తోన్న కొత్త సీఎం.. ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ఆఫీస్, ఢిల్లీలో తెలంగాణ భవన్నిర్మించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. 100 రోజుల్లో కాంగ్రెస్గ్యారంటీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని, ఇందుకు కౌంట్డౌన్మొదలైందని కేటీఆర్ పేర్కొన్నారు.