
హైదరాబాద్, వెలుగు : ప్రతి ఏడాది మాదిరిగానే ఈ వినాయక చవితికి సైతం లక్ష మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్రాజుతో కలిసి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా 4 రోజుల పాటు విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. జంట నగరాల్లోలోని 40 కేంద్రాల్లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో వీటిని అందజేస్తామన్నారు. అనంతరం సెక్రటేరియట్ లో సీఎస్ శాంతికుమారికి వినాయక ప్రతిమను అర్వింద్ కుమార్ అందజేశారు.
17 వరకు గ్రేటర్లో మట్టి విగ్రహాల పంపిణీ
వినాయక చవితి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో మట్టి గణేష్ విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఓ ప్రకటనలో తెలిపారు. వార్డుకు 2,500 చొప్పున ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.