బీహార్ లో ఒంటికాలిపై స్కూల్ కు వెళ్తున్న విద్యార్థిని సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.వీడియోను రీ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఆ అమ్మాయి వివరాలు ఎవరి దగ్గర నైనా ఉంటే తనకు తెలియజేయాలని కోరారు. అమ్మాయి కల సాకారం కావడం కోసం వ్యక్తిగత సామర్థ్యం మేరకు తన వంతు సాయం చేస్తానన్నారు.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022
బీహార్ లోని సివాన్ జిల్లా జముయి పట్టణానికి చెందిన ప్రియాంశు కుమారి ఒంటి కాలిపై స్కూల్ కు వెళ్తుంది. కృత్రిమ కాలు లేదు.. అనే విషయాన్ని పట్టించుకోకుండా చిన్నప్పటి నుంచి స్కూల్ కు వెళ్లొస్తోంది.‘‘నాకు చదువంటే ప్రాణం.. డాక్టర్ కావాలనేది జీవిత లక్ష్యం. నా కలలను చంపుకోలేను. ప్రభుత్వం స్పందించి కృత్రిమ కాలును అందించి నన్ను ఆదుకోవాలి. జీవిత ఆశయాలకు ఊపిరి పోయాలి’’ అని ప్రియాంశు విజ్ఞప్తి చేసింది. ఆమె తల్లిదండ్రులు సన్నకారు రైతులు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో తమ కూతురికి కృత్రిమ కాలును కొనిచ్చే స్థోమత వారికి లేదు. ఆమె కాలినడకన బడికి వెళ్తున్న వీడియోను ఏఎన్ఐ వార్తాసంస్థ ట్విటర్ లో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ విశేషంగా స్పందించారు. అవసరమైతే తామే ఆర్థికసాయం చేస్తామంటూ కొందరు కామెంట్స్ పెట్టారు.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022