టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. భూమికి జానెడు, మూడు ఫీట్లున్న వాళ్లు కేసీఆర్ పై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కేసీఆర్ తో పెట్టుకున్నోళ్లెవరూ ఇంత వరకు బాగుపడలేదని హెచ్చరించారు.
జేపీ నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడి పోయిండని.. కేసీఆర్ ను ఎందుకు జైలుకు పంపుతారో చెప్పాలన్నారు కేటీఆర్. డబ్బులు పంచి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నిస్తే తనకు నవ్వొస్తుందన్నారు. ఈ రెండు,మూడు ఫీట్లున్న వాళ్లతో ఒరిగేదేంలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఎవరు ఏం చేయాలన్నా ఢిల్లీ పోవాలని..కానీ ఇక్కడ కేసీఆర్ స్వీయ పాలనలో తెలంగాణ దూసుకుపోతుందన్నారు.
ALSO READ:నేషనల్ హైవేపై దారి దోపిడీ.. తుపాకులతో బెదిరించి దోచుకున్నారు
గడిచిన ఐదేళ్లలో 35 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు కట్టించామన్నారు కేటీఆర్. ఉప్పల్ నియోజకవర్గంలలో 453 కోట్లతో మంచినీళ్లు అందించామన్నారు. జీవో 54 కింద పేదవారికి దాదాపు 10 వే మందికి పట్టాలు ఇచ్చామని చెప్పారు. 25 కోట్లతో స్కైవాక్ ను ప్రారంభించామన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని తెలిపారు. 7.7 శాతంతో పచ్చదనం పెంచుకున్నామన్నారు. చాలా కంపెనీలు హైదరాబాద్ లో పరిశ్రమలు పెడుతున్నాయని.. తెలంగాణ వచ్చాక శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు.