కంటోన్మెంట్ లో పలు రోడ్లు మూసివేత
మిలటరీ అధికారుల తీరుపై కేటీఆర్ సీరియస్
సికింద్రాబాద్ .. కంటోన్మెంట్ ఏరియాలో పలు రోడ్ల మూసివేతపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కంప్లయింట్ చేశారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. మిలటరీ అధికారుల ప్రవర్తన చాలా వింతగా ఉందని.. ఇప్పటికే చాలాసార్లు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు. ఐనప్పటికీ… రోడ్లను మూసివేసి.. పౌరులకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. ఈ విషయంలో స్పందించి వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో కోరారు కేటీఆర్.
బొలారంలోని కేంద్రీయ విద్యాలయం దగ్గర్లో పూరీ సింగ్ మార్గ్ ను లోకల్ మిలటరీ అధికారులు మంగళవారం మూసివేశారు. దీంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో కేటీఆర్ కు నివేదించారు స్థానికులు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించి.. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
Extremely strange behaviour despite repeated requests from Govt of Telangana and the local residents
I request Hon’ble Defence Minister Sri @rajnathsingh Ji to intervene and issue instructions to the local Cantonment officials to avoid inconvenience to public ? https://t.co/rz4Esd6pyk
— KTR (@KTRTRS) September 18, 2019