కుబేర ఎమోషన్స్‌‌‌‌తో ఎంగేజ్ చేస్తాడు

కుబేర ఎమోషన్స్‌‌‌‌తో ఎంగేజ్ చేస్తాడు

కుబేర’ చిత్రంలోని ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందని  నిర్మాతలు  సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు  అన్నారు. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్‌‌‌‌లో శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రం జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు చెప్పిన విశేషాలు. 

‘‘శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’  తర్వాత ఈ కథను చెప్పారు. దీనికి ధనుష్ గారు అయితే బాగుంటుందని భావించాం.  ఆయనకు స్టోరీ చెప్పగా 20 నిమిషాలు కథ విని వెంటనే ఓకే చేశారు.  ధనుష్  పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున గారు కూడా కొన్ని హిందీ చిత్రాల్లో నటించారు. అలాగే రష్మిక గురించి అందరికీ తెలిసిందే.  

ఇండియాలో ఆమె పాపులర్ యాక్ట్రెస్.  కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్‌‌‌‌తో సినిమా చేశాం. ఇది తెలుగు, తమిళ స్ట్రయిట్ మూవీ.  హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం.  ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇందులో శేఖర్ కమ్ముల చూపించిన ఎమోషన్స్ ఆడియెన్స్‌‌‌‌కు కొత్త ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ను ఇవ్వబోతున్నాయి. మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్,   పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్.. ఇదే ఈ సినిమా కథ. కొన్ని సీన్ల కోసం  రియల్ స్లమ్స్,  డంపింగ్ యార్డ్స్‌‌‌‌లో షూట్ చేశాం. ముంబైలోని  వీధుల్లో షూట్ చేయడం చాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది. 

సినిమాని చాలా గ్రాండ్‌‌‌‌గా రిలీజ్ చేస్తున్నాం.  దాదాపు 1600 స్క్రీన్స్‌‌‌‌లో  రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.  ఇక  శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు’’.