- బీఆర్ఎస్ హయాంలోనే భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆగ్రహం
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి బీఆర్ఎస్ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. శుక్రవారం ఆయన బాలానగర్, ఫతేనగర్డివిజన్లలో పర్యటనకు వెళ్లిన సమయంలో పలు కాలనీలు, బస్తీల వాసులు కాంగ్రెస్ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. హ్యాట్రిక్ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న కృష్ణారావు బాలానగర్, ఫతేనగర్ డివిజన్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్హయాంలోనే పలు కాలనీలు, భూములను 22ఏ జాబితాలో చేర్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో మరోసారి తమను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వచ్చి, వారిని ఠాణాకు తరలించారు.
