13 ఏళ్లుగా రోడ్డు పై ఫుడ్ కోర్ట్ నడిపిస్తున్న సాయి కుమారి అలియాస్ కుమారి ఆంటీ (Kumari Aunty)..గత మూడు నెలల కాలంలో సడెన్గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన కుమారి ఆంటీదే హవా. హైదరాబాద్ ఫేమస్ ప్లేస్ లో ఫుడ్ స్టాల్ నడుపుకునే ఈ ఆంటీ ఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయారు. వచ్చిన కస్టమర్స్ ను నాన్నా, బుజ్జి, కన్నా అంటూ ప్రేమగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఫుడ్ కోర్ట్ ను విజిట్ చేస్తా అని చెప్పడంతో మరింత ఫేమస్ అయిపొయింది. ఇదిలా ఉంటే..
రీసెంట్గా కుమారి ఆంటీ ఓ టీవీ షోకు స్పెషల్ గెస్ట్గా అటెండ్ అయ్యారు.బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరూ రీ యూనియన్ తో పేరుతో ‘బిగ్బాస్ ఉత్సవం’(Bigg Boss Utsavam) స్పెషల్ ఈవెంట్ను స్టార్ మా ప్లాన్ చేసింది.
బిగ్బాస్ ఉత్సవం షోకి ఫేమస్ యాంకర్ శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించారు. ఈ షోకు కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్గా వచ్చి అందరిని తన మాటలతో ఎంటర్ టైన్ మెంట్ చేశారు. అలాగే బిగ్బాస్ కంటెస్టెంట్స్కు కూడా తనదైన వంటకాలతో రుచి చూపించారు. కుమారి ఆంటీ చేసిన నాన్ వెజ్ భోజనంకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఫిదా అయ్యారని తెలుస్తోంది.
బిగ్బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్తో కలిసి కుమారీ ఆంటీ ఎంతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదండోయ్..కుమారి ఆంటీతో స్టార్ మా యాజమాన్యం ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు సమాచారం. కుమారీ ఆంటీ బిగ్బాస్ ఉత్సవం త్వరలో మరింత మందిని అలరించడానికి స్టార్ మా, డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ తెలిపారు. దీంతో యూట్యూబర్లు ఆమె ఇంటర్వూస్ కోసం ఎగబడుతున్నారు. త్వరలో ఈమె నుంచి మరిన్ని షోస్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
#BBUtsavam షో లో #KumariAunty !
— Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024
అందరికీ NonVeg భోజనం కూడా... pic.twitter.com/SfmCzFSjOd
Also Read :విజయ్కి పోటీగా ..విశాల్ కొత్త పొలిటికల్ పార్టీ.!